నాగశౌర్య పాదయాత్రకు బ్రహ్మరథం పడుతోన్న ప్రేక్షకలోకం!
ప్రజల వద్దకు వెళ్లి..ప్రజల కష్టాలను తెలుసుకుంటూ..వారికి భరోసా కల్పించడమే పాదయాత్ర యొక్క ముఖ్యోద్దేశం. ఒకప్పుడు ఎన్టీఆర్, వైయస్ఆర్ లాంటి మహా నాయకులు పాదయాత్ర చేసి ప్రజల మనసులు గెలుచుకున్నారు. ఆ కోవలోనే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి దాన్ని తన విజయయాత్రగా మలుచుకున్నారు. ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే… ఇప్పటి వరకు రాజకీయ నాయకులే పాదయాత్ర చేశారు..కానీ, తొలిసారిగా కథానాయకుడు నాగశౌర్య విభిన్నంగా ఆలోచించి తను తాజాగా నటించిన `కృష్ణ వ్రింద విహారి` చిత్రం ప్రమోషన్ కోసం పాదయాత్ర చేస్తూ ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు అటు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
ఇప్పటి వరకు మెయిన్ సిటీస్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, కాలేజ్ ప్రమోషన్స్ తో ప్రేక్షకులు ఆకట్టుకున్న తెలుగు సినిమా దర్శక నిర్మాతలు నాగశౌర్య చేస్తోన్న పాదయాత్రతో తాము కూడా ఏదైనా కొత్తగా చేయాలన్న ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.
ఏడుకొండల ఎంకన్న సాక్షిగా ఈ నెల 14న తిరుపతిలో తన పాదయాత్ర ప్రారంభించి నెల్లూరు, ఒంగోలు, విజయవాడ,గుంటూరు, ఏలూరు , భీమవరం, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ తో ముగించనున్నారు. ప్రతి ఊరిలో కృష్ణ వ్రింద విహారి చిత్ర యూనిట్కి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలందరితో మమేకమై పోతూ ..వారితో ఫ్రెండ్లీ గా సంభాషిస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు నాగశౌర్య. సినిమా కోసం ఎంత హార్డ్ వర్క్ చేయడానికైనా సిద్ధంగా ఉండే యువ నాయకుల్లో ఎప్పుడూ ముందుంటారు నాగశౌర్య అంటూ టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. కృష్ణ వ్రింద విహారి చిత్రం ఈ నెల 23న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కృష్ణ వ్రింద విహారి చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు తెలియజేస్తోంది తాజా సినిమా.